చిన్నారికి కిడ్నీ సమస్య కేటీఆర్ సాయం

చిన్నారికి కిడ్నీ సమస్య కేటీఆర్ సాయం

నందిపేట, వెలుగు: కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారిని ఆదుకోవాలని చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలానికి చెందిన దర్శనం సుజాత కూతురు అవంతిక(4) కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆపరేషన్​కు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు.

దీనిపై గ్రామస్థులు ట్విట్టర్లో మంత్రికి మెస్సేజ్‌ ‌పంపగా స్పందించిన మంత్రి పాపను ఆదుకుంటామని తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా పాప తల్లికి సమాచారమిచ్చారు. సోమవారం హైదరాబాద్‌‌లోని రెయిన్‌‌బో హాస్పిటల్​కు పాపను తీసుకెళ్లనున్నట్లు చిన్నారి తల్లి సుజాత తెలిపారు.