నందిపేట, వెలుగు: కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారిని ఆదుకోవాలని చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలానికి చెందిన దర్శనం సుజాత కూతురు అవంతిక(4) కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆపరేషన్కు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు.
దీనిపై గ్రామస్థులు ట్విట్టర్లో మంత్రికి మెస్సేజ్ పంపగా స్పందించిన మంత్రి పాపను ఆదుకుంటామని తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా పాప తల్లికి సమాచారమిచ్చారు. సోమవారం హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కు పాపను తీసుకెళ్లనున్నట్లు చిన్నారి తల్లి సుజాత తెలిపారు.
Will take care brother @KTRoffice please contact and assist https://t.co/FVO8pYLdyq
— KTR (@KTRTRS) January 2, 2020