రైతుబీమా డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు

రైతుబీమా డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు

రైతుబీమా డబ్బుల కోసం కని పెంచిన తల్లినే హతమార్చాడు ఓ దుర్మార్గుడు. సంగారెడ్డి జిల్లాలో ఏడాది క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కంగరి మండలం బాబులాగమ శివారులో తులసీ బాయి అనే మ‌హిళ‌ గత ఏడాది హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి హత్య మిస్టరీని చేధించారు. మృతురాలి కొడుకు పవార్ శంకర్, మనుమడు పుండలిక్‌తో కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఆమెకున్న వ్యవసాయ భూమికి గానూ ప్రభుత్వం రూ. 5 లక్షల రైతుబీమా డబ్బులను ప్రకటించగా.. కేవలం ఆ డబ్బుల కోసం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఏడాది తరువాత ఈ హ‌త్య కేసు కు సంబంధించి..సొంత కొడుకు, మ‌నుమ‌డే దోషుల‌ని తేల‌డంతో స్థానికులు షాక్ కు గుర‌వుతున్నారు.