
చందానగర్, వెలుగు: అత్తగారింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గణేశ్నగర్కు చెందిన కావ్య(29), గోపన్పల్లి గ్రామానికి చెందిన రాజుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు చందానగర్లో నివాసముంటున్నారు. రాజు సెక్యూరిటీ గార్డుగా, కావ్య ఇండ్లల్లో పనిచేస్తున్నారు. వీరికి సంతానం కలుగకపోవడంతో కొన్ని రోజులుగా అత్తింటివారు కావ్యను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. మరోవైపు భర్త అదనపు కట్నం కోసం ఇబ్బందులు పెడుతున్నాడు. దీంతో ఆమె ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరి ఫిర్యాదుతో చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.