Hyderabad: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్

Hyderabad: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్

చందానగర్​, వెలుగు: అత్తగారింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్​ జిల్లా జమ్మికుంట గణేశ్​నగర్​కు చెందిన కావ్య(29), గోపన్​పల్లి గ్రామానికి చెందిన రాజుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు చందానగర్​లో నివాసముంటున్నారు. రాజు సెక్యూరిటీ గార్డుగా, కావ్య ఇండ్లల్లో పనిచేస్తున్నారు. వీరికి సంతానం కలుగకపోవడంతో కొన్ని రోజులుగా అత్తింటివారు కావ్యను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. మరోవైపు భర్త అదనపు కట్నం కోసం ఇబ్బందులు పెడుతున్నాడు. దీంతో ఆమె ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరి ఫిర్యాదుతో చందానగర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.