రేవంత్, ఠాకూర్ పై హైకమాండ్ కు ఫిర్యాదు!

రేవంత్, ఠాకూర్ పై హైకమాండ్ కు ఫిర్యాదు!

తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్త నేతల సమావేశాలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో  సమావేశమైన కొందరు నేతలు తాజాగా మరోసారి భేటీకి సిద్ధమయ్యారు. సీనియర్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో  హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశం జరగనుంది.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి.. భేటీకి రావాలని స్వయంగా ఆహ్వానించారు వీహెచ్. కానీ రాజగోపాల్ రెడ్డి అసమ్మతి నేతల సమావేశానికి హాజరు కానట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం

 

వాకింగ్ ఎంత నడవాలి? ఎలా నడవాలి?

యుద్ధాన్ని ఆపకుంటే.. రష్యా కోలుకోవడానికి ఓ తరం పడతది