రాజ్యాంగం మార్చడం కోసం ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు : సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగం మార్చడం కోసం ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు  : సీఎం రేవంత్ రెడ్డి

దేశ ప్రజాస్వామిక మనుగడకు ముప్పు వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం కోసమే బీజేపీ 400 సీట్లు అంటుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడమనేది 2000 సంవత్సరంలోనే మొదలైందని 2004లో బీజేపీ ప్రభుత్వం వచ్చుంటే అప్పుడే మారుస్తుండే అని చెప్పారు. ఇప్పుడు మార్చడం కోసమే ఎనమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని విమర్శించారు. 

తన ఒక్కడి కోసం మాట్లడటం లేదని 140 కోట్ల మంది ప్రజల కోసం మాట్లాడుతున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి. దేశంలో మతపరమైన రిజర్వేషన్ లేదని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ నాయకులు చెప్పేదానికి చేసేదానికి పోలీక ఉండదని అన్నారు.  ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే క్యాండేట్లను బయపెట్టి విత్ డ్రా చేపిస్తున్నారని ఆరోపించారు. 

మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని ఇవ్వకుండా నిరుద్యోగ యువతతో ఆటలాడుతున్నారని ఫైర్ అయ్యారు.