యాదాద్రి జిల్లాలో నిప్పంటించుకుని మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య‌

యాదాద్రి జిల్లాలో నిప్పంటించుకుని మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య‌

యాదాద్రి భువనగిరి జిల్లాలో మైన‌ర్ బాలిక(15) నిప్పంటిచుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఆత్మ‌కూరు మండ‌లంలోని పోతిరెడ్డిప‌ల్లి గ్రామానికి చెందిన ఎల‌బోయిన చంద‌న‌(15) శ‌నివారం మ‌ధ్యాహ్నం ఇంట్లో ఎవ్వ‌రూలేని స‌మ‌యంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గ‌మ‌నించి మంట‌లు ఆర్పే స‌మ‌యానికే ఆమె చ‌నిపోయింది. విష‌యం తెలిసిన కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. బాలిక ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.‌