
చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్ష విధించింది. రూ.40 లక్షల చెక్ బౌన్స్కు సంబంధించి 2010లో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మంగళవారం కేసు విచారణ జరగ్గా, మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు చెప్పింది. అయితే..ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.40.5 లక్షల నగదు చెల్లించేందుకు ఒప్పుకోవడంతో లాయర్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ డబ్బును చెల్లించేందుకు మోహన్ బాబు 30 రోజుల గడువు కోరారు.