బిడ్డను కన్న తొమ్మిది రోజులకే అమ్మిన తల్లి..

బిడ్డను కన్న తొమ్మిది రోజులకే అమ్మిన తల్లి..

నవమాసాలు మోసీ, పురిటి నొప్పులు భరించి బిడ్డను కన్నతల్లి.. తొమ్మిది రోజులకే మరోకరికి అమ్మేసింది. ఈ విషాధకర ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన భీమమ్మ, రాములు దంపతులకు కొంతకాలం కిందట ఓ శిశువు జన్మించింది. వారు ఆ బిడ్డను తొమ్మిది రోజులకే రూ. 80 వేలకు అమ్మేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. దర్యాప్తు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని.. శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ కేసులో శిశువు తల్లి భీమమ్మను A1 నిందితురాలిగా, ఆమె భర్త రాములును A2 నిందితునిగా చేర్చారు. అదేవిధంగా శిశువును అమ్మడానికి సహకరించిన తాండూరుకు చెందిన మరో ఇద్దరిని A3, A4 నిందితులుగా చేర్చారు.

For More News..

పుదుచ్చేరిలో రేపు రాహుల్ పర్యటన.. నేడు మైనార్టీలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం

చెన్నై టెస్టులో భారత్ ఘన విజయం

హుండీలు నిండాయని కానుకలు తీసుకోని ఆలయ సిబ్బంది