ప్రభుత్వ భూమిలో గుడిసెలు..నిప్పంటించిన అధికారులు

ప్రభుత్వ భూమిలో గుడిసెలు..నిప్పంటించిన అధికారులు

మహబూబాబాద్ ​అర్బన్, వెలుగు: మహబూబాబాద్ ​పట్టణ శివారు అనంతారం రోడ్​లోని ప్రభుత్వ భూమిలో  వెలసిన గుడిసెలను శనివారం ఉదయం రెవెన్యూ అధికారులు దహనం చేశారు. మహబూబాబాద్​ రెవెన్యూ పరిధిలోని 255 సర్వే నంబర్​లో సుమారు 50 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఐదు నెలల క్రితం పేదలు అక్కడ గుడిసెలను వేసుకుని ఉంటున్నారు. ఈ భూమిని గత నెలలో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ సందర్శించారు. ప్రభుత్వ ఆఫీసులకు భూములను కేటాయించాలని, వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్​ సిబ్బందితో అధికారులు అక్కడికి వెళ్లి స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా గుడిసెలో ఉన్న సామగ్రి బయటకు తీసుకువచ్చారు. తర్వాత రెవెన్యూ, మున్సిపల్​ సిబ్బంది గుడిసెలకు నిప్పు పెట్టి తగలబెట్టారు.