పాఠశాల సమీపంలో మొసలి..భయాందోళనలో విద్యార్థులు

పాఠశాల సమీపంలో మొసలి..భయాందోళనలో విద్యార్థులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ కేజీబీవీ ప్రహరీ గోడ వద్ద మొసలి సంచారం కలకలం రేపింది. పక్కన చెరువులో నుండి కేజీబీవీ సమీపంలోకి వచ్చిన మొసలిని చూసి విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు అయితే భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. అసలు కేజీబీవీ పాఠశాల సమీపంలోకి మొసలి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. చెరువులోకి మొసలి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. 

మొసలి చెరువులోకి వచ్చి ఎన్ని రోజులైంది? చెరువులోకి రావడానికి ఎగువ ప్రాంతంలో ఏమైనా ప్రాజెక్టు ఉందా? అనేది అధికారులు ఆరా తీస్తున్నారు. పాఠశాల సమీపంలోకి వచ్చిన మొసలిని పట్టుకుంటామని..ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.