అలాంటి ప్రపోజల్ లేదన్న కేంద్ర ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: పరిమితికి మించి బంగారం ఉంటే దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ‘‘గోల్డ్ ఆమ్నెస్టీ’’పేరుతో కొత్త స్కీమ్ తీసుకురానున్నట్లు వస్తోన్న వార్తలను గురువారం కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు కొట్టిపారేశాయి. ఇలాంటి ప్రపోజలేదీ లేదని, బడ్జెట్ తయారుచేసే టైమ్లో ఇలాంటి పుకార్లు రావడం సహజమేనని అధికారులు తెలిపారు. బ్లాక్ మనీ వెలికితీసేందుకు గతంలో ‘స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం’ తరహాలోనే పరిమితికి మించి ఉన్న బంగారాన్ని కూడా స్వచ్ఛందంగా వెల్లడించే పథకాన్ని మోదీ సర్కార్ ప్రవేశపెట్టబోతోందంటూ బుధవారం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.