
కేంద్రప్రభుత్వం వాణిజ్య రాజధాని ముంబయి (Mumbai)లో దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) నిర్మించిన విషయం తెలిసందే. దానికి అటల్ సేతుగా నామకరణం కూడా చేశారు. తాజాగా ఈ వంతెనపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రయాణించారు. అటల్ సేతుపై కారులో ప్రయాణిస్తూ, దాని గురించి వివరిస్తూ మాట్లాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు రష్మిక. దాంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Absolutely! Nothing more satisfying than connecting people and improving lives. https://t.co/GZ3gbLN2bb
— Narendra Modi (@narendramodi) May 16, 2024
తాజాగా రష్మిక చేసిన ఈ వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Modi) స్పందించారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడానికి మించిన సంతృప్తి ఏముంటుంది.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోడీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక.. ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోనే పొడవైన ఈ వంతెన.. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్లోని నహవా శేవాను కలుపుతుంది. దాదాపు రూ.21,200కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన ఈ అటల్ సేతు మొత్తం పొడవు 21.8 కి.మీ.లు. అందులో దాదాపు 16 కి.మీ.ల వరకు అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.