Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ

Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ

కేంద్రప్రభుత్వం వాణిజ్య రాజధాని ముంబయి (Mumbai)లో దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ (MTHL) నిర్మించిన విషయం తెలిసందే. దానికి అటల్ సేతుగా నామకరణం కూడా చేశారు. తాజాగా ఈ వంతెనపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రయాణించారు. అటల్‌ సేతుపై కారులో ప్రయాణిస్తూ, దాని గురించి వివరిస్తూ మాట్లాడిన వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు రష్మిక. దాంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తాజాగా రష్మిక చేసిన ఈ వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Modi) స్పందించారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడానికి మించిన సంతృప్తి ఏముంటుంది.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోడీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక.. ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ (MTHL)ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోనే పొడవైన ఈ వంతెన.. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌లోని నహవా శేవాను కలుపుతుంది. దాదాపు రూ.21,200కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన ఈ అటల్‌ సేతు మొత్తం పొడవు 21.8 కి.మీ.లు.  అందులో దాదాపు 16 కి.మీ.ల వరకు అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.