ఎన్ఎస్‌‌యూఐలో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది

ఎన్ఎస్‌‌యూఐలో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది
  • రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు : ఎన్ఎస్​యూఐలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం గాంధీభవన్​లో ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి బల్మూరి వెంకట్ అధ్యక్షత వహించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన విధంగానే లోక్​సభ ఎన్నికల్లోనూ పని చేసి కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని సూచించారు.

తాను ఎమ్మెల్సీ అయ్యానంటే ఎన్​ఎస్​యూఐకి కాంగ్రెస్ ఇచ్చిన గుర్తింపే కారణమని చెప్పారు. తాను విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసినప్పుడు ప్రతి ఎన్ఎస్​యూఐ కార్యకర్త తనకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ ను పలువురు ఎన్​ఎస్ యూఐ నాయకులు అభినందించారు.