కేసులకు సీఎం రేవంత్ రెడ్డి భయపడరు : చామల కిరణ్ కుమార్ రెడ్డి

కేసులకు సీఎం రేవంత్ రెడ్డి భయపడరు : చామల కిరణ్ కుమార్ రెడ్డి

బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నో ఫేక్ న్యూస్ లను వైరల్ చేసిందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టడంలో కీలకంగా వాడుకుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో భయపెట్టి, బెదిరించి లొంగదీసుకున్నట్లు తెలంగాణాలో కూడా చేద్దామనుకుంటుందని ఫైర్ అయ్యారు. 

కేసులకు సీఎం రేవంత్ రెడ్డి భయపడడని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ కు కాంగ్రెస్ కు ఏం సంబంధం లేదని బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తదని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దయితయ్ అని మాట్లాడ్డం తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణాలో నియంత పాలన సాగించిన కేసీఆర్ ను బొంద పెట్టామని చెప్పారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బొందపెడ్తామని అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.