- మూడు రోజుల కింద రూ.7 లక్షలు దోపిడీ
- నలుగురు రిమాండ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ బండ్లగూడ పరిధిలో క్రిప్టో కరెన్సీ బిజినెస్చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి..తమ దగ్గరకు పిలిపించుకుని దోపిడీలు చేస్తున్న ఓ ముఠాను బండ్లగూడ పోలీసులు పట్టుకున్నారు.
కంచన్బాగ్కు చెందిన ఫిట్నెస్ ట్రైనర్ సబేర్ బిన్ అహ్మద్ హద్రానీ అలియాస్ సైఫ్, కార్వాన్కు చెందిన స్టూడెంట్మహమ్మద్ అబుల్ సలామ్, రాజేంద్రనగర్కు చెందిన విద్యార్థి మహమ్మద్ అనస్, పహాడీషరీఫ్కు చెందిన డ్రైవర్మహమ్మద్ ఆసిఫ్, ఆసిఫ్ క్రిప్టో కరెన్సీ బిజినెస్లో లాభాలు వస్తాయని ఫేస్బుక్ద్వారా పలువురిని సంప్రదిస్తారు. తర్వాత వారిని తామున్న చోటికి రప్పించుకుని నిలువు దోపిడీ చేస్తారు.
బేగంబజార్కు చెందిన జేఆర్ చౌదరిని కూడా నిందితులు కొద్ది రోజుల కింద కొంతమంది సోషల్మీడియా ద్వారా సంప్రదించారు. అతడిని నమ్మించడంతో రూ.7 లక్షలు తీసుకుని ఆగస్టు15న బండ్లగూడలోని ఇస్మాయిల్ నగర్కు వెళ్లాడు.
వారి ప్లాన్ప్రకారం చౌదరిని బెదిరించి డబ్బులను దోచుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో 17న చాంద్రాయణగుట్టలోని కింగ్స్ స్నూకర్ వద్ద నిందితులను అరెస్ట్చేశారు. డబ్బులతో ఆసిఫ్పరారయ్యాడని, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ముఠా గతంలోనూ పలు నేరాలకు పాల్పడిందని తేలింది. చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ పర్యవేక్షణలో బండ్లగూడ సీఐ ఆర్. దేవేందర్, ఎస్సై ఎస్. నాగరాజ్ రెడ్డి కేసును చేధించారు.
