ఈటలపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలె

ఈటలపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలె

ఖైరతాబాద్, వెలుగు: ఎమ్మెల్యే ఈటల రాజేందర్​పై బాల్క సుమన్, గువ్వల బాలరాజ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఓయూ  జేఏసీ  నేత పుల్లారావు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన  మీడియా ఆయన మాట్లాడుతూ..  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉస్మానియా వర్సిటీ నుంచి విద్యార్థి నేతగా ఎదిగి.. ఎంపీ, ఎమ్మెల్యే అయిన బాల్క సుమన్  వర్సిటీకి ఏం చేశాడో సమాధానం చెప్పాలన్నారు. ఈటలపై మాట్లాడే హక్కు బాల్క సుమన్, బాలరాజుకు లేదన్నారు. వారిద్దరు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో వర్సిటీ జేఏసీ నాయకులు మేడి రమణ, నవీన్ యాదవ్,  నెహ్రూ నాయక్, సంపత్ పాల్గొన్నారు. ఈటల రాజేందర్ పై  టీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీసీ సంఘాల జేఏసీ నాయకుడు సంగెం సూర్యా రావు మండిపడ్డారు.  సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. బాల్క సుమన్, గువ్వల బాలరాజు ఇద్దరు ఈటలకు క్షమాపణ చెప్పకపోతే వారి ఇండ్లను ముట్టడిస్తామన్నారు. 

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
ముషీరాబాద్: ఎమ్మెల్యే ఈటలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని బీజేసీ సీనియర్ నేత తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అన్నారు. గాంధీ నగర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ పాత్ర గొప్పదన్నారు. ఈటల రాజేందర్ పై ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ చేసిన వ్యాఖ్యలు విని జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిసే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతున్నారన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరసింహ, కొలను పద్మజ, రాజు తదితరులు పాల్గొన్నారు.