అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురు అరెస్ట్

అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురిని పేట్​బషీరాబాద్​పోలీసులు అరెస్ట్​ చేశారు. కుత్బుల్లాపూర్ లోని సర్వే నంబర్ 25/1 లోని 3 ఎకరాల భూమిలోకి గతేడాది అక్టోబర్​లో కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి కాంపౌండ్ వాల్ కూల్చి వేయగా క్రిమినల్ ​కేసు నమోదైంది. గురువారం మరోసారి కూన మాణిక్యం గౌరీశ్​ అతని అనుచరులు యండమూరి దుర్గ, అమరిజింత అరవింద్​, సోనాసింగ్​, మహాసింగ్​, రంజిత్​ సింగ్​, బచన్​సింగ్​ అక్రమంగా ప్రవేశించారు. 

దీంతో వారిని అరెస్ట్​ చేసి కుత్బుల్లాపూర్​ తహసీల్దార్ ఎదుట బైండోవర్​ చేశారు. వారి వద్ద మూడు కార్లను స్వాధీనం చేసుకుని  సీజ్ ​చేసినట్లు పోలీసులు తెలిపారు.