దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో డాక్టర్లు, సిబ్బందిలో ఎక్కువ శాతం కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది.
మనదేశంలో 5 రాష్ట్రాల్లో 62శాతం యాక్టీవ్ కేసులు నమోదువుతున్నాయి. వాటిల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ , ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఆరు రాష్ట్రాల్లో హెల్త్ కేర్ సిబ్బంది, డాక్టర్లకు కరోనా సోకుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు నమోదవుతున్నాయి. వాటిల్లో తెలంగాణ (18 శాతం), మహారాష్ట్ర (16 శాతం) ఢిల్లీ (14 శాతం), కర్ణాటక (13 శాతం), పుదుచ్చేరి (12 శాతం), పంజాబ్ (11 శాతం) ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.