శ్రీహరి కోటకు చేరుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

శ్రీహరి కోటకు చేరుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట చేరుకున్నారు. రేపు తెల్లవారుజామున జరగనున్న చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఆయన ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో శ్రీహరికోట వెళ్లారు రాష్ట్రపతి. స్పేస్ సెంటర్ లో కొత్తగా నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని పరిశీలించారు. తర్వాత రెండో ప్రయోగ వేదిక దగ్గరకెళ్లి చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న జీఎస్ ఎల్వీ మార్క్ 3 M 1 వాహక నౌకను పరిశీలించనున్నారు. తెల్లవారుజామున రెండున్నరకు మిషన్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లనున్నారు రాష్ట్రపతి.