మోత మోగిస్తున్న ఉల్లి ధర..కేజీ రూ.120

మోత మోగిస్తున్న ఉల్లి ధర..కేజీ రూ.120

ఉల్లి కొనకుండానే కన్నీరు పెట్టిస్తుంది. వర్షాలకు పంట దెబ్బతినడంతో  ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్లోకి దిగుమతి తగ్గడంతో పలు రాష్ట్రాల్లో కేజీ ఉల్లి ధర రూ.80 నుంచి 100 వరకు ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉల్లి  కేజీ  ధర  రూ.80 నుంచి రూ.100  వరకు ఉంది. భోపాల్ లో  కేజీ ఉల్లి ధర రూ.80 పలుకుతుండగా దిగుమతి తగ్గడంతో ఇంకా పెరిగే అవకాశముందంటున్నారు వ్యాపారులు. ఏకంగా రూ.40 పెరిగి  రూ.120 వరకు పెరగవచ్చంటున్నారు. దీంతో వినియోగదారులు ఉల్లి కొనాలంటేనే భయపడుతున్నారు.