ఇవాళ(శుక్రవారం) కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి నిల్వచేసే రంగనాయక సాగర్ ప్రారంభోత్సవం జరగనుంది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. దీనికి సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3300 కోట్లను ఖర్చు చేసింది. కాళేశ్వరం నుంచి సుమారు 220 కిలో మీటర్లు ప్రయాణం చేసి సాగునీరు రంగనాయక సాగర్కు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుంది. మొత్తం మూడు TMCల సామర్ధంతో నిర్మాణమైన ఈ ప్రాజెక్టులో ఎప్పుడు 1.5 TMCల నీరు నిలువ ఉంటాయి. ఈ రిజర్వాయర్తో మొత్తం 1.10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ను చిన్నకోడూరు మం డలంలోని చంద్లాపూర్- పెద్దకోడూరు శివారులో 3 TMCల సామర్థ్యంతో 8.6 కిలో మీటర్ల చూట్టూ భారీ కట్టను నిర్మించారు.