దిశ హంతకులకు సరైన శిక్ష పడింది: నిర్భయ తల్లి

దిశ హంతకులకు సరైన శిక్ష పడింది: నిర్భయ తల్లి

దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై  హర్షం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి ఆశాదేవి. తాను ఏడేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు.తనకు పట్టిన గతి మరి ఎవరికీ రాకూడదన్నారు. దిశ తల్లిదండ్రులకు కేవలం పదిరోజుల్లో జరిగిందని..ఇందుకు హైదరాబాద్ పోలీసులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. దిశ హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేసిన హైదరాబాద్ పోలీసులపై ఎటువంటి విచారణ ఉండరాదని  ఆమె  డిమాండ్ చేశారు. పోలీసులపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలని భావించినా, మరో ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. పోలీసులు విధించిన శిక్షను చూసి తానెంతో సంతోషించానని, వారు తమ విధిని సక్రమంగా నిర్వర్తించారన్నారు. ఈ ఘటనతో మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి ఓ కఠిన హెచ్చరిక వెళ్లిందని అన్నారు.

నేరస్థులకు సరైన శిక్ష పడిందన్న నిర్భయ తల్లి …తన కూతురి విషయంలో కూడా త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.సాధ్యమైనంత త్వరగా ఉరి తీయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

దిశ హత్య  విషయంలో మాట్లాడిన నిర్భయ తల్లి ఆశాదేవి.. నా కుమార్తెకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. దిశ కుటుంబానికి మాత్రం అంత ఆలస్యం జరగదు. చాలా తొందరగానే వారి కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ తో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి.