డబుల్ బెడ్రూం లబ్దిదారుల ఎంపికలో గందరగోళం

డబుల్ బెడ్రూం లబ్దిదారుల ఎంపికలో గందరగోళం

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన 33 వార్డులో డబుల్ బెడ్రూం లబ్దిదారుల ఎంపికలో గందరగోళం ఏర్పడింది. ఎంపిక డ్రా ద్వారా అధికారులు లబ్దిదారులను ఎంపిక చేశారు. అయితే జాబితాలో తమ పేర్లు లేవంటూ స్థానికులు ఆందోళనకి దిగారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు డ్రా పూర్తి చేశారు.