రిటైర్‌ అయిన SBI సిబ్బంది కి మళ్లీ ఉద్యోగం

రిటైర్‌ అయిన SBI సిబ్బంది కి మళ్లీ ఉద్యోగం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI ) పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్‌ అయిన సిబ్బంది మళ్లీ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, ఎస్బీఐ సర్కిల్‌ ఆఫీసుల్లో నియామక ప్రక్రియ జరగనుందని తెలిపింది. ఇదివరకే ఢిల్లీ సర్కిల్‌లో ఉద్యోగ నియామకాలను చేపట్టిన బ్యాంక్‌.. ప్రస్తుతం హైదరాబాద్‌, అమరావతి, పాట్నా, ముంబై మెట్రో, మహారాష్ట్ర పరిధిలో నియామకాలు చేపట్టింది. 60 ఏళ్లలో పదవీ విరమణ చేసిన స్కేల్‌ 1 నుంచి స్కేల్‌ 5 అధికారులు ఇందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరి వయస్సు 63 మించరాదని తెలపింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారు లేదా డిస్మిస్‌ అయినవారు ఇందుకు అనర్షులు. రూ.30-40 వేలలోపు వేతనంగా నిర్ణయించింది. ఏడాది కాలపరిమితితో నియామకం చేస్తున్న బ్యాంక్‌.. మరో ఏడాది కూడా పెంచే అవకాశం ఉన్నదని లేటెస్టు నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఎంతమందిని తీసుకునే దానిపై బ్యాంక్‌ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, 500 మందిని తీసుకోనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.