రాష్ట్రానికి కొత్తగా ఏడుగురు IASలు

రాష్ట్రానికి కొత్తగా ఏడుగురు IASలు

హైదరాబాద్‌‌, వెలుగుసివిల్ సర్వీసెస్ 2019 బ్యాచ్ అభ్యర్థులకు క్యాడర్ అలకేట్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణ కేడర్​కు కొత్తగా ఏడుగురు ఐఏఎస్​ల ను కేంద్రం కేటాయించింది. ఏపీకి 9 మంది కొత్త ఐఏఎస్ లను కేటాయిస్తూ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమాచారం అందించింది.

తెలంగాణ క్యాడర్ కొత్త ఐఏఎస్ లు

  1. క్రాంతి వరుణ్ రెడ్డి
  2. చిత్రా మిశ్రా
  3. పాటిల్ హేమంత్ కేశవ్ (మహారాష్ట్ర)
  4. గరిమా అగర్వాల్ (మధ్యప్రదేశ్)
  5. దీపక్ తివారి (ఉత్తరాఖండ్)
  6. అంకిత్ (ఉత్తరప్రదేశ్)
  7. ప్రతిమా సింగ్ (ఉత్తరాఖండ్)

ఇతర రాష్ట్రాల క్యాడర్ కు వెళ్లనున్న తెలంగాణ వాళ్ళు

  1. మహమ్మద్ అబ్దుల్ షాహిద్
    (
    పశ్చిమ బెంగాల్)
  2. బి. వైష్ణవి – (త్రిపుర)
  3. నీలం లలితా ఆదిత్య -(చత్తీస్ గఢ్)