హైదరాబాద్, వెలుగు: సివిల్ సర్వీసెస్ 2019 బ్యాచ్ అభ్యర్థులకు క్యాడర్ అలకేట్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కేడర్కు కొత్తగా ఏడుగురు ఐఏఎస్ల ను కేంద్రం కేటాయించింది. ఏపీకి 9 మంది కొత్త ఐఏఎస్ లను కేటాయిస్తూ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమాచారం అందించింది.
తెలంగాణ క్యాడర్ కొత్త ఐఏఎస్ లు
- క్రాంతి వరుణ్ రెడ్డి
- చిత్రా మిశ్రా
- పాటిల్ హేమంత్ కేశవ్ (మహారాష్ట్ర)
- గరిమా అగర్వాల్ (మధ్యప్రదేశ్)
- దీపక్ తివారి (ఉత్తరాఖండ్)
- అంకిత్ (ఉత్తరప్రదేశ్)
- ప్రతిమా సింగ్ (ఉత్తరాఖండ్)
ఇతర రాష్ట్రాల క్యాడర్ కు వెళ్లనున్న తెలంగాణ వాళ్ళు
- మహమ్మద్ అబ్దుల్ షాహిద్ –
(పశ్చిమ బెంగాల్) - బి. వైష్ణవి – (త్రిపుర)
- నీలం లలితా ఆదిత్య -(చత్తీస్ గఢ్)