విషాదం.. గోదావరిలో ఏడుగురు గల్లంతు

విషాదం.. గోదావరిలో ఏడుగురు గల్లంతు

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు పుష్కరఘాట్ వద్ద గోదావరిలో స్నానం చేస్తుండగా ఏడుగురు గల్లంతయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు గజ ఈతగాళ్లు. గల్లంతైన మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్టకు చెందిన వారీగా  గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.