చెన్నై ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో టైటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్.. రైడింగ్లో కుమ్మేశాడు. హర్యానా డిఫెన్స్ను ఛేదిస్తూ 18 పాయింట్లు కొల్లగొట్టాడు. రైడింగ్కు వెళ్లిన ప్రతిసారి పాయింట్ తీసుకురావడంతో.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 40–29 పాయింట్లతో హర్యానా స్టీలర్స్పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో తెలుగు టీమ్కు ఇది రెండో విజయం. సిద్ధార్థ్ సూపర్–10తో (సింగిల్ మ్యాచ్లో 10 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్ల తీసుకురావడం) విజయంలో కీలక పాత్ర పోషించగా, సూరజ్ దేశాయ్ 6, అబోజర్, విశాల్ చెరో మూడు పాయింట్లతో అండగా నిలిచారు. సిద్ధార్థ్ ఈ సీజన్లో రెండోసారి సూపర్–10 సాధించడం విశేషం. హర్యానా తరఫున వికాస్ (9), వినయ్ (4), ప్రశాంత్ (3) మెరుగ్గా ఆడారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్కు దేశాయ్ బ్రదర్స్ రైడింగ్తో వరుసగా పాయింట్లు అందించారు. తొలి హాఫ్ మరో ఎనిమిది నిమిషాల్లో ముగుస్తుందనగా మంచి సమన్వయంతో వికాస్ను ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ 21–13 ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్లోనూ టైటాన్స్ డిఫెన్స్లో ఆకట్టుకుంది. వికాస్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా హర్యానాను ఆలౌట్ చేసింది. మరో మ్యాచ్లో పుణెరి పల్టన్ 31–31తో తమిళ్ తలైవాస్పై డ్రా చేసుకుంది. పల్టన్ టీమ్లో పంకజ్ (7), నితిన్ (5), సుర్జీత్ (7), మంజిత్ (5) రాణించారు. తలైవాస్లో రాహుల్ (8), అజిత్ (8), రన్సింగ్ (4) చెలరేగిన ప్రయోజనం లేకపోయింది.
సిద్ధార్థ్ కుమ్మేశాడు..టైటాన్స్కు రెండో విజయం
- ఆట
- August 19, 2019
లేటెస్ట్
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!