సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలె : ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్

సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలె : ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: రాజకీయాలు, ఓట్లు, గెలుపే కాకుండా.. సేవ ద్వారా ప్రజలకు దగ్గర కావాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సోమవారం కె.లక్ష్మణ్ పుట్టినరోజును ముషీరాబాద్​నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు ఆధ్వర్యంలో గాంధీనగర్ లో అన్నదానం చేశారు. లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. దేవుడిచ్చిన కొన్ని స్పెషల్ డేస్ ను పేదల మధ్య జరుపుకోవాలన్నారు. 

అంతకుముందు బీజేపీ లీడర్​నరేశ్​ఆధ్వర్యంలో అడిక్​మెట్ గవర్నమెంట్​స్కూల్​లో స్టూడెంట్లకు నోట్​బుక్స్ పంపిణీ చేశారు. రాంనగర్ గుండు, బాగ్​లింగంపల్లి, సుందరయ్య పార్క్, కవాడిగూడ, గాంధీనగర్, ముషీరాబాద్, భోలక్ పూర్ లో బీజేపీ సీనియర్ నాయకులు ఘనుకపాటి సూర్యనారాయణశర్మ, కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, రవి చారి, రచనశ్రీ, భరత్ గౌడ్, చాతిరి పార్థసారథి సగర, వినయ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం, బుక్స్, దుప్పట్లు పంపిణీ కార్యక్రమాల్లో లక్ష్మణ్​పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, జమాల్పూర్ నందు, కౌడిన్య ప్రసాద్, రామారావు, బాబు తదితరులు పాల్గొన్నారు.