‘కారును అదుపు చేయకపోతే ప్రజలకు ప్రమాదం’

‘కారును అదుపు చేయకపోతే ప్రజలకు ప్రమాదం’

అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న కారుకు ప్రజలు బ్రేక్ లు వేయాలన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కార్ స్టీరింగ్ కూడా MIM చేతుల్లో ఉందని ఆయన అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్ మాటల గారడి చేస్తున్నాడని, ఆయన మాయ మాటలు నమ్మి ఓటు వేసిన ప్రజలు మోసపోయారని అన్నారు. TRS పాలన పై ఛార్జ్  షీట్ ను విడుదల చేస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు.

“ తెలంగాణ రాష్ట్రంలో లండన్, ఇస్తాంబుల్, డల్లాస్ లాగా అద్దం లాంటి  రోడ్లు వేస్త అన్నడు. హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళలా తయారు జేస్తా అన్నడు. గుంత కనిపిస్తే 1000 రూపాయలు ఇస్త అన్నారు. మున్సిపాలిటీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు” వీటిలో ఏ ఒక్కటి అమలు పరచలేదన్నారు లక్ష్మణ్. పార్శీగుట్ట ను దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్…అక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు.నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మున్సిపాలిటీలకు కేంద్ర నిధులు ఇచ్చింది తప్ప కేసీఆర్ ఇవ్వలేదు” అని చెప్పారు లక్ష్మణ్. పేదల సంక్షేమం వదిలి, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతూ నియంతలా పాలిస్తున్నారని, కారు ను అదుపు చేయకపోతే ప్రజలకు ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. అందుకే TRS కు కాకుండా ప్రజలు బీజేపీ కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్.