చందానగర్​లో మళ్లీ స్వచ్ఛ ఆటోలు మాయం

చందానగర్​లో మళ్లీ స్వచ్ఛ ఆటోలు మాయం

శేరిలింగంపల్లి, వెలుగు: చందానగర్​ సర్కిల్​ పరిధిలో మళ్లీ స్వచ్ఛ ఆటోలు మాయమయ్యాయి. చెత్త సేకరణ కోసం అధికారులు పంపిణీ చేసిన ఆరు స్వచ్ఛ ఆటోలు కనిపించటం లేదని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి 10 రోజులైనా కాకముందే మరో 4 ఆటోలు మాయమవడం  చర్చనీయాంశంగా మారింది. స్చచ్ఛ హైదరాబాద్​లో భాగంగా కాలనీలు, బస్తీల్లో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించటం కోసం అధికారులు కొందరు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆటోలు అందజేస్తున్నారు. ఇలా  అందజేసిన ఆటోల్లో 6 ఆటోలు కనిపించటం లేవని ఈనెల 15న చందానగర్​ సర్కిల్​ ఏఎంహెచ్​వో డాక్టర్​ కార్తీక్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. శుక్రవారం మళ్లీ 4 ఆటోలు కనిపించకుండా పోవడంతో మరోసారి సర్కిల్ అధికారులు పోలీసులకు కంప్లయింట్ చేశారు.