రోడ్డు పనులు ప్రారంభించకుంటే టెండర్ క్యాన్సిల్ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రోడ్డు పనులు ప్రారంభించకుంటే టెండర్ క్యాన్సిల్ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • ఆత్మకూరు(ఎం), మోత్కూరు మెయిన్​ రోడ్డు పనుల పరిశీలన

ఆత్మకూరు(ఎం), మోత్కూరు, (యాదాద్రి), వెలుగు: నిలిపేసిన రోడ్డు పనులను మూడు రోజుల్లో తిరిగి ప్రారంభించకుంటే టెండర్లు రద్దు చేసి కొత్త ఏజెన్సీలకు పనులు అప్పజెబుతానని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంట్రాక్టర్లను హెచ్చరించారు.

యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) నుంచి మోత్కూరు వెళ్లే మెయిన్​ రోడ్డు పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. నిలిచిపోయిన రోడ్డు పనులతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వెంటనే సంబంధిత కాంట్రాక్టర్కు ఫోన్​ చేసి పనులు ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

యాదగిరిగుట్ట-తుర్కపల్లి రోడ్డులోనూ పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి చేయాలని చెప్పారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే  టెండర్‌‌ రద్దు చేసి, ఇతర ఏజెన్సీలకు అప్పగించి రోడ్డు నిర్మాణపు పనులు పూర్తి చేయిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్​ అనురాగ్​ జయంతి, ఆర్​అండ్​బీ ఆఫీసర్​ సరిత ఉన్నారు.

ఒక్కరి పేరు కూడా మిస్​ కావద్దు
సర్​ ప్రక్రియ కారణంగా అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా మిస్​ కావద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆత్మకూరు(ఎం)లో నిర్వహించిన ఆలేరు నియోజవర్గ స్థాయి సర్​ రివ్యూలో ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్యతో కలిసి ఆయన మాట్లాడారు.

ప్రతి ఒక్క ఓటరును కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్​పై ఉందన్నారు. సర్​ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొన్న  పలువురు బీఎల్వోలకు మంత్రి నగదు ప్రోత్సాహకం అందించారు.