కరోనా ఎఫెక్ట్..హోటల్ ఇండస్ట్రీకి భారీ నష్టం

కరోనా ఎఫెక్ట్..హోటల్ ఇండస్ట్రీకి భారీ నష్టం

న్యూఢిల్లీకరోనా ఔట్‌‌‌‌ బ్రేక్ తర్వాత ఎక్కువగా నష్టపోయింది హోటల్స్​​ ఇండస్ట్రీనే. వివిధ దేశాలు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను అమలు చేస్తుండడంతో ఎక్కడిక్కడ ప్రయాణాలు నిలిచిపోయాయి. హోటల్స్‌‌‌‌లలో ఆక్యుపెన్సి(నిండడం) కనిష్ట స్థాయిలకు పడిపోతున్నాయి. ఇండియన్‌‌‌‌ హోటల్‌‌‌‌ ఇండస్ట్రీపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి.  హోటల్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లకు క్యాపిటల్‌‌‌‌, ఖర్చులు ఎక్కువగా ఉంటాయని  లెమన్‌‌‌‌ ట్రీ హోటల్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పతంజలి జీ కేశ్వాని అన్నారు. క్యాపిటల్‌‌‌‌ కోసం అప్పులు, వీటిపైన వడ్డీలు పెరుగుతాయని అన్నారు. వీటికి తోడుగా హోటల్స్‌‌‌‌లలో ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ పన్నులు, మినిమమ్‌‌‌‌ లోడ్‌‌‌‌ ఛార్జీలు వంటివి ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌గా ఉంటాయని అన్నారు. ఫిబ్రవరి నాటికి ఇండియన్‌‌‌‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఆక్యుపెన్సి 65–70 శాతం వరకు ఉండేదని కేశ్వాన్‌‌‌‌ అన్నారు. మార్చి నెల నుంచి ఆక్యుపెన్సి కనిష్ట స్థాయిలకు పడిపోయిందని తెలిపారు. ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఇండియాలో హోటల్స్‌‌‌‌ ఆక్యుపెన్సి మరింత పడిపోతుందని, దీంతో  హోటళ్లు షట్‌‌‌‌డౌన్‌‌‌‌ లేదా లిమిటెడ్‌‌‌‌గా నడవడమో జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఉద్యోగులను తొలగించొద్దని, శాలరీలను కట్‌‌‌‌ చేయొద్దని ప్రభుత్వం కోరిందని, దీనికి నిధుల సమస్య ఉంటుందని అన్నారు.

ఇలాంటి పరిస్థితులలో హోల్డింగ్‌‌‌‌ కంపెనీ వంటి ఎక్స్‌‌‌‌టర్నల్‌‌‌‌ సోర్సెస్‌‌‌‌ నుంచి క్యాపిటల్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌ లేకపోతే కష్టమని అభిప్రాయపడ్డారు. మూడు నెలల మారటోరియం ప్రకటించి ప్రభుత్వం మంచి పనిచేసిందని కేశ్వాని అన్నారు. కానీ ఈ టైమ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ చాలా తక్కువని, 12 నెలల మారటోరియాన్ని ప్రకటించుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.  ప్రభుత్వం నుంచి కనీస మద్ధతును హోటల్‌‌‌‌ ఇండస్ట్రీ ఆశిస్తోందని అన్నారు. పన్నులను మాఫీ చేయడం, శాలరీలు చెల్లించడంలో సపోర్ట్‌‌‌‌ వంటివి ఇండస్ట్రీకి అవసరమన్నారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో హోటల్‌‌‌‌ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతోందని సిగ్నెట్‌‌‌‌ హోటల్స్‌‌‌‌ ఎండీ సర్బేంద్ర సర్కారీ అన్నారు. హోటల్ రిజర్వేషన్లు పడిపోయాయని, క్యాన్సిలేషన్లు పెరిగాయని చెప్పారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించిన మూడు నెలల మారటోరియం ఇండస్ట్రీకి పెద్ద రిలీఫ్‌‌‌‌ అని చెప్పారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం మరిన్ని ప్రకటించాలని కోరారు.   గతేడాది 95 శాతం ఆక్యుపెన్సి ఉండేదని, కరోనా దెబ్బతో ప్రస్తుతం ఇది ఐదు శాతానికి పడిపోయిందని  బర్డ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరక్టర్‌‌‌‌‌‌‌‌ అంకూర్‌‌‌‌‌‌‌‌ భాటియా అన్నారు. కరోనా దెబ్బతో ముఖ్యంగా హోటల్‌‌‌‌, టూరిజం ఇండస్ట్రీ నష్టపోతోందని చెప్పారు. వివిధ దేశాలు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ప్రకటించడంతో ట్రావెల్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా నష్టపోతోందని అమత్రా హోటల్స్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ అనురాగ్‌‌‌‌ దువే అన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించిన మూడు నెలల మారటోరియాన్ని హాస్పిటాలిటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు పెద్ద రిలీఫ్‌‌‌‌ అని అన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దేశంలో ఈ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.