పారాబాయిల్డ్ రైస్ సేకరణపై కేంద్రం మరో ప్రకటన

పారాబాయిల్డ్ రైస్ సేకరణపై కేంద్రం మరో ప్రకటన

పారాబాయిల్డ్ రైస్ సేకరణపై కేంద్రం మరో ప్రకటన చేసింది. తెలంగాణ కోరినందుకు.. గత రబీకి సంబంధించి... మరో  24.75 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరిస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 2021 సెప్టెంబర్ 30న అప్పటికే ఆమోదించిన 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు.. అదనంగా మరో 20 లక్షల టన్నుల పారాబాయిల్డ్ రైస్ తీసుకుంటామని కేంద్రం చెప్పింది. దీంతో గత రబీ నుంచి మొత్తం 44.75 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్, మిగతాది ముడి బియ్యం రూపంలో తీసుకుంటున్నామని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.