డిజిటల్ టెక్నాలజీకి సామ్సంగ్ కొత్త రూపునిస్తోంది. డిజిటల్ఆర్ట్ఫ్రేమ్గా మార్చుకోగలిగే కొత్త రకం టీవీని ఇటీవలే విడుదల చేసింది. ‘ద ఫ్రేమ్’ పేరుతో సామ్సంగ్ 55 అంగుళాల స్మార్ట్ టీవీని రిలీజ్ చేసింది. ‘క్యూఎల్ఈడీ’ టెక్నాలజీతో రూపొందిన ఈ టీవీని అవసరమనుకున్నప్పుడు డిజిటల్ ఆర్ట్ఫ్రేమ్ గా మార్చుకోవచ్చు.
టీవీపై ఇమేజెస్ను డిస్ప్లే చేస్తే అది డిజిటల్ ఆర్ట్ రూపంలో కనిపిస్తుంది. టీవీలో ఆర్ట్మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫీచర్ను యూజ్చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్, ఇంటెలిజెంట్సెన్సర్స్ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.19,999.