న్యూఢిల్లీ: సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయమని మెట్రో నగరాల జనం అనుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని కంట్రోల్స్ను తొలగించిన వెంటనే ఇంటి కొనుగోలుకు ప్రయత్నాలు షురూ చేస్తామని చెబుతున్నారు. ఫైనాన్షియల్ మార్కెట్లు కుప్పకూలడం, ఇతర ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షణీయంగా లేవు కాబట్టి రెసిడెన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని అంటున్నారు.
లాక్డౌన్ కారణంగా ఇండ్ల ధరలు కూడా తగ్గుతాయన్న అంచనాలు ఉండటంతో చాలా మంది సొంతిల్లు కొనడానికి ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు. పేరున్న లేదా ప్రభుత్వ సంస్థలు నిర్మించే ఇండ్లను కొనడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ప్రాపర్టీ కన్సల్టంట్ అనరాక్ ఏడు పెద్ద సిటీల్లోని రెండు వేల మందితో సర్వే చేయగా, వారిలో 75 శాతం మంది త్వరలో ఇల్లు కొంటామని చెప్పారు.
ఈ నివేదిక ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ డెవెలప్మెంట్ అథారిటీ, హరియాణా అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ, మహారాష్ట్ర హౌజింగ్ అండ్ ఏరియా డెవెలప్మెంట్ అథారిటీ వంటి ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఇండ్లు కొనడానికి ఇంపార్టెన్స్ ఇస్తామని వారిలో 14 శాతం మంది చెప్పారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తారనే పేరున్న కంపెనీల నుంచి ఇల్లు తీసుకుంటామని 62 శాతం మంది అన్నారు. ప్రాజెక్టులు ఆలస్యంగా పూర్తయినా ఫర్లేదు కానీ ఇంటి ధర తక్కువగా ఉంటేనే కొంటామని ఆరు శాతం మంది పేర్కొన్నారు. ఎగ్జిక్యూషన్ రిస్కులు కాస్త తక్కువ ఉన్న డెవలపర్లను ఎంచుకుంటామని 18 శాతం మంది అన్నారు. లేబర్ కొరత, రా మెటీరియల్, లిక్విడిటీ లేకపోవడం వంటి సమస్యలను ఎగ్జిక్యూషన్ రిస్కులుగా పిలుస్తారు.
ఇదే సరైన సమయం
- ఇప్పుడున్న పరిస్థితుల్లో రెసిడెన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన పని అని 48 శాతం మంది స్పష్టం చేశారు. స్టా క్ మార్కెట్లో పెట్టుబడిపై ఆసక్తి ఉందని 25 శాతం మంది, బంగారం కొంటామని 18 శాతం మంది, ఎఫ్డీల్లో ఇన్వెస్ట్ చేస్తా మని తొమ్మిది శాతం మంది చెప్పారు.
- ఫ్లాట్ కొనాలన్న ప్లాన్ను కొంతకాలం పక్కనబెడతామని 16 శాతం మంది చెప్పారు. 6–12 నెలల్లోపు ఫ్లాట్ కొంటామని 28 శాతం మంది చెప్పారు.
- ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూ రు, హైదరాబాద్, పుణేలో గత ఏడాది 2.61 లక్షల హౌజింగ్ యూనిట్లు అమ్ముడ య్యాయి. వీటిలో బ్రాండెడ్ డెవలపర్ల వాటా 54 శాతం కాగా, మిగతా ఇండ్లను నాన్–బ్రాండెడ్ డెవలపర్లు అమ్మారు.
- ఈ ఏడాదిలో మార్చి వరకు ఈ ఏడు సిటీల్లో 42,500 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో బ్రాండెడ్ డెవలపర్ల వాటా 59 శాతం వరకు ఉంది. కనీసం పదేళ్ల నుంచి రియల్టీ రంగంలో ఉంటూ మార్కెట్లో లిస్టయిన కంపెనీలను బ్రాండెడ్ డెవలపర్లని అంటారు.
- ఇతర ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షణీయంగా లేకపోవడం, రెంట్లు ఎక్కువ ఉండటంతో పాటు హౌజింగ్ లోన్ల వడ్డీలు తక్కువ ఉం డటం వల్ల యువ ఉద్యోగుల్లో చాలా మం ది ఇల్లు కొనడానికి ఇష్టపడుతున్నారు.
- బెంగళూరు, ముంబై, హైదరాబాద్లో ఇల్లు కొంటామని బయర్స్లో 82 శాతం మంది చెప్పారు. వీరిలో కొందరు ఇది వరకే ఫ్లాట్లను బుక్ చేశారు.
- హౌజింగ్ మార్కెట్కు డిమాండ్ ఉన్న ప్పటికీ, ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమ య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో పనిచేసే వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. మిగతావారు వెళ్లడానికి ప్రయత్ని స్తు న్నారు. కరోనా భయం వల్ల చాలా మంది పనికి రావడానికి ఇష్టపడటం లేదని డెవెలపర్లు చెబుతున్నారు.