కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా..ముగ్గురు మృతి

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా..ముగ్గురు మృతి

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కూసుమంచి మండలం జీళ్ల చెరువు వద్ద ఇవాల ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది కూలీలు ఉన్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి వచ్చి గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.