నీరజ్ చోప్రాకు సన్మానం.. రూ.6 కోట్ల చెక్కు

నీరజ్ చోప్రాకు సన్మానం.. రూ.6 కోట్ల చెక్కు

టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను సన్మానించారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్. చండీగఢ్ లో ముఖ్యమంత్రిని కలిశారు నీరజ్ చోప్రా. హర్యానా ప్రభుత్వ పాలసీ ప్రకారం... నీరజ్ చోప్రాకు 6 కోట్ల రూపాయల చెక్కును అందించారు మనోహర్ లాల్ ఖట్టార్. హర్యానాను స్పోర్ట్స్ హబ్ గా మార్చాలనుకుంటున్నామని ఖట్టార్ చెప్పారు. దీనికోసం ఏర్పాటు చేయనున్న సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కు హెడ్ గా ఉండాలని నీరజ్ చోప్రాను కోరినట్టు తెలిపారు. దేశంలో స్పోర్ట్స్ ని ప్రమోట్ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని నీరజ్ చెప్పాడు. ఇప్పటికైతే తన లక్ష్యం వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ చాంపియన్ షిప్ లో మెడల్ సాధించడమేనని చెప్పాడు.