నాకు అసంతృప్తి లేదు..టీఆర్ఎస్ లోనే ఉంటా

నాకు అసంతృప్తి  లేదు..టీఆర్ఎస్ లోనే ఉంటా

దళితులకు మూడెకరాల భూమి లాంటి పథకం సక్సెస్ కాలేదు కాబట్టే.. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తెచ్చారన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. దళిత పథకాలు అనుకున్నంత ముందుకు పోవటం లేదన్నారు. అందుకే దళిత ఎంపవర్ మెంట్ స్కీం వచ్చిందన్నారు. తెలంగాణలో దళితులకు దళితబంధు ఇస్తున్నాం.. ఇంతకన్నా సామాజిక న్యాయం ఇంకేం వుంటుందని ప్రశ్నించారు. బీఎస్పీ నార్త్ పార్టీ.. ఇక్కడ ఆపార్టీకి భవిష్యత్ లేదన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో తాను బ్రదర్ అనిల్ కలిసినట్లు వచ్చిన ఫోటోలు మూడేళ్ల క్రితం నాటివని చెప్పారు. టీఆర్ఎస్ లో తాను సంతృప్తిగానే ఉన్నానని..పార్టీని వీడబోనన్నారు రాజయ్య.