ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్

ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణ ఎంపీ కరోనా బారిన పడ్డారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంపీల బృందంతో పాటు ఆయన కూడా ఉన్నారు. వారం రోజుల పాటు మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయన ఢిల్లీలో ఉన్నారు .ఈ మేరకు  ఆయన సోషల్ మీడియాలోపోస్టు పెట్టారు. ‘టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అధికారులకు ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే... కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.’ అంటూ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

ఇవి కూడా చదవండి: 

మంత్రి ఎర్రబెల్లికి కరోనా పాజిటివ్

ఆ దీక్ష పచ్చి అవకాశవాదం