వాషింగ్టన్: తాలిబన్ నేతలతో శాంతి చర్చలు జరపట్లేదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు హింసకు పాల్పడుతున్న తాలిబన్లను నమ్మలేమని అన్నారు. ఆదివారం జరగాల్సిన మీటింగ్ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. అఫ్గానిస్తాన్లో దీర్ఘకాలంగాసాగుతున్న యుద్ధాన్ని ఆపేయడంతో పాటు అక్కడ మోహరించిన బలగా ల ఉపసంహరణ దిశగా అమెరికా చర్చలు జరుపుతోంది. దీనిపై ఇటు తాలిబన్లీడర్లు, అటు అఫ్గాన్ ప్రెసిడెంట్తో ట్రంప్ విడివిడిగా సమావేశం అవుతారని పెంటగాన్ గతంలో ప్రకటించింది. ఆదివారం ఈ భేటీ జరగాల్సి ఉండగా.. శనివా రం సాయంత్రం ఈ చర్చలకు గుడ్బై చెబుతున్నట్లు ట్రంప్ ట్వీట్ చేశారు. మూడు రోజుల క్రితం కాబూల్లో తాలిబన్లు బాంబు దాడి జరపడంతో అమెరికన్ సైనికుడితో పాటు 11 మంది చనిపోయారు. ఈ నేపథ్యం లోనే చర్చలకు ట్రంప్ నో చెప్పినట్లు వాషింగ్టన్ వర్గాలు వెల్లడించాయి.