ఇద్దరు స్పైస్‌‌జెట్ పైలెట్లపై వేటు

ఇద్దరు స్పైస్‌‌జెట్ పైలెట్లపై వేటు

రూల్స్‌‌ ప్రకారం విమానాన్ని నడపని ఇద్దరు స్పైస్‌‌జెట్ పైలెట్లపై ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ ఏడాది పాటు నిషేధం విధించింది. బీ737 ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌ను ముంబై రన్‌‌వేపై అత్యంత వేగంగా నడిపారని, విమానం రన్‌‌వే దాటి ముందుకు దూసుకువచ్చిందని  డీజీసీఏ  పేర్కొంది. స్పైస్‌‌జెట్‌‌కు చెందిన కోయంబత్తూర్–ముంబై విమానాన్ని ఇద్దరు పైలెట్లు కెప్టెన్ కరుణ్ గుజ్‌‌రాల్, కెప్టెన్ అర్పిత్ గాంధీలు నడిపారు. ఈ నెల రెండోతేదీన వీరు ముంబై రన్‌‌వేపై అత్యంత వేగంగా నడిపినట్టు డీజీసీఏ గుర్తించింది. ఈ ఇద్దరు పైలెట్లకు జూలై 4న షోకాజు నోటీసు జారీ చేసింది. ఈ విషయంపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే వారు పంపిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో, డీజీసీఏ వీరిపై చర్యలు తీసుకుంది. ఇద్దరిపై ఏడాది పాటు నిషేధం పాటు విధిస్తున్నట్టు పేర్కొంది.