అమెరికా నుంచి భారత్ కు 200 వెంటిలేటర్లు

అమెరికా నుంచి భారత్ కు 200 వెంటిలేటర్లు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హామీతో భారత్‌కు వెంటిలేటర్లు రానున్నాయి. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ డెవలప్ మెంట్  ఏజెన్సీ.. భారత్‌కు 200 వెంటిలేటర్లు విరాళం ఇవ్వనున్నట్లు తెలిసింది.  రాబోయే నెల రోజుల్లో ఆ వెంటిలేటర్లు మనకు అందనున్నాయి. మే, జూన్‌ నెలల్లో.. రెండు దఫాల్లో వెంటిలేటర్లు భారత్ కు రానున్నాయి. యూఎస్‌ ఎయిడ్‌ నిధుల కింద వెంటిలేటర్లు విరాళంగా ఇవ్వనున్నట్లు అమెరికా తెలిపింది. అమెరికా అవసరాల కోసం వెంటిలేటర్లు తయారు చేశారు. ఇతర దేశాలు కూడా ఆ వెంటిలేటర్లు వాడుకునే విధంగా మారుస్తున్నారు. అయితే విరాళంలో భాగంగా కొన్నింటిని ఇండియాకు పంపిస్తున్నట్లు వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలీగ్‌ మెకన్నీ తెలిపారు.