Kamakshi Bhaskarla: పొలిమేర నటికి అరుదైన గౌరవం.. ఉత్తమ నటిగా దాదా సాహెబ్ ఫాల్కే జ్యురీ అవార్డు

Kamakshi Bhaskarla: పొలిమేర నటికి అరుదైన గౌరవం.. ఉత్తమ నటిగా దాదా సాహెబ్ ఫాల్కే జ్యురీ అవార్డు

టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla)కు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024(14th Dada Saheb Phalke Film Festival 2024) అవార్డుల కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డు అందుకున్నారు నటి కామాక్షి భాస్కర్ల. ఇటీవల ఆమె నటించిన సూపర్ హిట్ మూవీ పొలిమేర 2 సినిమాకి గాను ఆమె ఈ అవార్డు అందుకున్నారు. దీంతో.. కెరీర్ ప్రారంభంలోనే ఇంత ప్రతిష్టాత్మకమైన  ఆవార్డు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కామాక్షి.

ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు కామాక్షి.. పొలిమేర 2 మూవీలో నా నటనకు ఉత్తమ నటిగా అవార్డు రావడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ అవార్డు ఎంపిక చేసిన జ్యూరీకి నా ధన్యవాదాలు. ఈ అవార్డు నటిగా నా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా నాకు నటన నేర్పిన గురువుగారు రత్నశేఖర్‌, నీజర్ కబి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. నా ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసి అందరికి ఈ అవార్డును అంకితమిస్తున్నాను. కామాక్షి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా.. అది నెటిజన్స్, ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక కామాక్షి భాస్కర్ల విషయానికి వస్తే.. ఆమె తన డాక్టర్ చదువును పూర్తి చేశారు. కానీ, నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. అలా మిస్ తెలంగాణగా నిలిచిన కామాక్షి... ఆ ఫేమ్ తోనే సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు దక్కించుకున్నారు. ఇటీవల వచ్చిన పొలిమేర సినిమాతో మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు దక్కించుకున్న ఆమె.. ఈమద్యే ఓం భీం బుష్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.