దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిధుల గోల్మాల్ దుమారం రేపుతోంది. అక్రమాలు, అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేస్తోంది. రూ. 4 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో… రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కోసం… కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆధారాలతో సహా టీటీడీకి ఫిర్యాదు చేశాడు ఓ భక్తుడు. ఫిర్యాదులపై మొదట టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాశ్ జోక్యం చేసుకోవడంతో.. విచారణ ఆగింది. ఐతే.. ఆ భక్తుడు నేరుగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డికి ఫిర్యాదు చేశాడు. అవకతవకల నిగ్గు తేల్చాల్సిందిగా … రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ను కోరింది రాష్ట్ర ప్రభుత్వం. రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండ్రోజులుగా ఢిల్లీలోని ఏఈఓ కార్యాలయంలో రికార్డుల తనిఖీలు చేస్తున్నారు.
ఢిల్లీ టీటీడీ గుడిలో గోల్ మాల్.. పూజలకోసం రూ.4కోట్లు స్వాహా!
- దేశం
- August 23, 2019
లేటెస్ట్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు