ఢిల్లీ టీటీడీ గుడిలో గోల్ మాల్.. పూజలకోసం రూ.4కోట్లు స్వాహా!

ఢిల్లీ టీటీడీ గుడిలో గోల్ మాల్.. పూజలకోసం రూ.4కోట్లు స్వాహా!

దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిధుల గోల్‌మాల్ దుమారం రేపుతోంది. అక్రమాలు, అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేస్తోంది. రూ. 4 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో… రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కోసం… కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆధారాలతో సహా టీటీడీకి ఫిర్యాదు చేశాడు ఓ భక్తుడు. ఫిర్యాదులపై మొదట టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాశ్ జోక్యం చేసుకోవడంతో.. విచారణ ఆగింది. ఐతే.. ఆ భక్తుడు నేరుగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డికి ఫిర్యాదు చేశాడు. అవకతవకల నిగ్గు తేల్చాల్సిందిగా … రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ను కోరింది రాష్ట్ర ప్రభుత్వం. రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండ్రోజులుగా ఢిల్లీలోని ఏఈఓ కార్యాలయంలో రికార్డుల తనిఖీలు చేస్తున్నారు.