ఓటుకు నోటు కేసు విచారణ ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా

ఓటుకు నోటు కేసు విచారణ ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా

ఓటుకు నోటు కేసులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టిన ఏసీబీ స్పెషల్ కోర్టు.. విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ1గా ముద్దాయిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నందున ఆయన్ను కోర్టులో హాజరుపర్చలేదు. మిగతా నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ కోర్టుకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో కూడి ఛార్జిషీట్ దాఖలు చేసింది.