వీల్‌‌‌‌‌‌‌‌చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తోపుకుంటు 10 కి.మీ. పొయ్యిండు

వీల్‌‌‌‌‌‌‌‌చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తోపుకుంటు  10 కి.మీ. పొయ్యిండు

మద్దూరు, వెలుగు : దివ్యాంగుడైన నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామానికి  చెందిన మారెటి బసప్ప (42) వీల్‌‌‌‌‌‌‌‌చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 10 కి.మీ. ప్రయాణం చేశాడు. ఎడ్లబండి కింద పడడంతో ఒక కాలు,  కన్ను పోగొట్టుకొని దివ్యాంగుడిగా మారిన ఇతను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ని మక్కామసీదు  వద్ద ఉంటున్నాడు. గురువారం రాత్రి తన సొంతూరుకు వెళ్దామని మద్దూరుకు వచ్చాడు. బస్సులు, అటోలు లేకపోవడంతో శుక్రవారం ఉదయం వీల్‌‌‌‌‌‌‌‌చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తోపుకుంటు  10 కి.మీ. దూరంలోని ఊరికి వెళ్లాడు.