శానిటరీ ప్యాడ్లు.. సాక్సుల్లో దాచి షిప్​లోకి డ్రగ్స్​

శానిటరీ ప్యాడ్లు.. సాక్సుల్లో దాచి షిప్​లోకి డ్రగ్స్​

ముంబై: క్రూయిజ్ ​షిప్​లో రేవ్​ పార్టీలో పట్టుబడ్డ డ్రగ్స్​ను ఓ మహిళ శానీటరీ ప్యాడ్లలో దాచి తీసుకొచ్చిందని నార్కోటిక్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) అధికారుల విచారణలో తేలింది. షిప్​లోకి ఎంటరయ్యే టైమ్​లో సెక్యూరిటీ చెకింగ్​లో పట్టుబడకుండా ఉండేందుకే ఇలా చేసిందని చెప్పారు. క్రూయిజ్​ షిప్​లోని సీసీటీవీ ఫుటేజ్​లు పరిశీలించగా.. ఓ యువతి శానిటరీ ప్యాడ్లలో నుంచి కొన్ని ప్యాకెట్లను బయటకు తీయడం కనిపించిందని తెలిపారు. మరో ఫుటేజీలో అర్బాజ్​ ఖాన్​ తన సాక్సుల్లో రహస్యంగా తీసుకొచ్చిన డ్రగ్స్​ను వినయోగించేందుకు ప్రయత్నిస్తున్నాడని వివరించారు. కాగా, ఈ కేసులో మరొకరిని అరెస్టు చేసినట్లు ఎన్​సీబీ డైరెక్టర్​ సమీర్​ వాంఖడే మీడియాకు వెల్లడించారు. ఇందులో ఫారెనర్లకూ సంబంధం ఉందని తేలిందని, ఇద్దరు ఫారెనర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన వివరించారు.