కువైట్ నుంచి వచ్చేటప్పుడు భర్తతో ఫోన్లో వాగ్వాదం..
భర్తకు భయపడి ఎవరికీ చెప్పకుండా కడపలో చెల్లి వద్దకు వెళ్లానంటున్న దుర్గ
దుర్గతోపాటు.. ఆమె భర్త సత్యనారాయణకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
విజయవాడ: గన్నవరం ఎయిర్ పోర్టులో మాయమైన మహిళ ఆచూకీ లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ ఈనెల 16వ తేదీన కువైట్ నుంచి వచ్చి.. గన్నవరం ఎయిర్ పోర్టులో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత కూడా తనకు ఫోన్ చేసిన తన భార్య ఇంటికి రాలేదని… ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుండడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన తర్వాత ఎటువెళ్లింది తెలియరాలేదు. దీంతో ఈ విషయం కలకలం రేపింది. కిడ్నాప్ అన్న అనుమానాలు చెలరేగడం సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాల్ డేటాను పరిశీలించడంతోపాటు.. గొడవ గురించి తెలుసుకుని మరింత లోతుగా విచారణ చేశారు. భర్తతో గొడవ వల్లే ఆమె ఆచూకీ లేకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు కడపలో ఫోన్ స్విచాన్ చేయడంతో ఆమె ఆచూకీ లభించింది. పోలీసులు ట్రేస్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. తన భర్త కోపంతో గొడవకు దిగడం వల్లే భయపడి కడపలో చెల్లి దగ్గరకు వెళ్లానని సమాధానం ఇచ్చింది. దీంతో భార్యా భర్తలు ఇరువురికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
for moe News..
హైదరాబాద్లో 48 శాతం తగ్గిన ఇళ్ల అమ్మకాలు
ఇన్స్టాగ్రామ్లో దోస్తీ.. ఇంటికొచ్చి దోపిడీ
గన్నవరం ఎయిర్ పోర్టులో మాయమైన మహిళ ఆచూకీ లభ్యం
- ఆంధ్రప్రదేశ్
- December 22, 2020
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్