ప్రశ్నించే గొంతుకలకు అండగా ఉంటా

ప్రశ్నించే గొంతుకలకు అండగా ఉంటా

కోల్‌కతా: బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారంతో దుమ్ము రేపుతున్నాయి. కాలి మడమ గాయంతో క్యాంపెయినింగ్‌కు దూరంగా ఉన్న దీదీ కూడా తిరిగి ప్రచార భేరిని మొదలుపెట్టారు. ప్రధాని మోడీపై ఆమె విమర్శలను సంధించారు. మోడీ అసమర్థుడని, ఆయన దేశాన్ని నడపలేరని దుయ్యబట్టారు. ‘ప్రశ్నించే గొంతుకలను కేంద్రం అణచుతోంది. రాజకీయ గళాలను కూడా మాట్లాడకుండా చేస్తున్నారు. ఆ గొంతుకలను నేను అండగా ఉంటా. వారిని అణచివేస్తున్న శక్తుల మీద పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నా. బీజేపీ హఠావో దేశ్ బచావో. మోడీ అసమర్థుడు. ఆయన దేశాన్ని పాలించడలేడు’ అని మమత చెప్పారు.