రేపు భారత్ బంద్

రేపు భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. రైతులు చేపట్టిన నిరసన దాదాపు నాలుగు నెలలు దాటింది. ఇప్పటికి ఢిల్లీ బోర్డర్లలో  నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు అన్నదాతలు. అయితే ఈ నెల 26 న సంయుక్త కిసాన్‌ మోర్చా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. రైతులు చేపట్టిన నిరసన నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా బంద్‌ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నేత భూటాసింగ్‌ తెలిపారు. బంద్ శాంతియుతంగానే కొనసాగుతోందన్నారు.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ లో పాల్గొననున్నారు నిరసనకారులు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అధికార YCP భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ నిరసన తెలుపుతోంది.